చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి: ఇసుక ట్రాక్టర్లను తాహసీల్దార్ ఉషాశారద సీజ్ చేసినారు. బుధవారం మండల రెవెన్యూ కార్యాలయం లో సీజ్ చేసిన ట్రాక్టర్ల వద్ద ఆమె మాట్లాడుతూ..... సీతయిగూడెం గ్రామ శివారు లో గల ఏదుళ్ల వాగులో మంగళవారం రాత్రి అక్రమంగా ఇసుకను తవ్వుతున్నట్లు సమాచారం రావడంతో రెవిన్యూ సిబ్బంది దాడి చేసి ఏడు ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నారు. మండలం లో ఎవరైనా ఇసుకను, మట్టిని అనుమతులు లేకుండా తవ్వినా, తరలించిన ట్రాక్టర్లను, జెసిబి లను సీజ్ చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ భూముల్లో, చెరువుశిఖలాల్లో సైతం మట్టిని తవ్వితే చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమం లో ఆమె రెవిన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: