మన్యం టీవీ : ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు రైతులు పండించిన పంటలు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని,పంటకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వామపక్షాలు డిమాండ్ చేస్తూ తహశీల్దార్ కార్యాలయంలో ముందు ధర్నా చేశారు .అనంతరం జరిగిన సభలో సీపీఎం పార్టీ రాష్ట్ర నాయకులు ఏ జే రమేష్, సీ పీ ఐ జిల్లా నాయకులు కె సారయ్య లు మాట్లాడుతూ..కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల జీవితాలతో దోబూచులాట ఆడుతున్నారని,రైతులకు గిట్టబాటు ధరలు, ఇవ్వాలని పండించిన పంటలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఓకరి పై ఒకరు తిట్టుకోవడం తప్ప రైతులకు విరిగింది ఏమీ లేదని అన్నారు. ఈ కార్యక్రమం లో సీపీఐ,సీపీఎం పార్టీ ల నాయకులు రైతులు పాల్గొన్నారు అనంతరం సీనియర్ అసిస్టెంట్ జామల కు వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమం లో అబ్దుల్ నబి,దేవులపల్లి యాకయ్య,కృష్ణ,కిరణ్,దేవరకొండ శంకర్,బంధం నాగయ్య, రాజారాం,శన్షుద్ధిన్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: