మన్యం మనుగడ, పినపాక:
రైతులు వరి ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని పినపాక సివిల్ సప్లయస్ డీటీ ముత్తయ్య అన్నారు. ఈ మేరకు మంగళవారం బయ్యారం ఏఈఓ కొమరం లక్ష్మణ్ రావ్ తో కలిసి
ఏడూళ్ళ బయ్యారం, పోతిరెడ్డిపల్లి లో రైతుల ధాన్యాన్ని పరిశీలించారు. పలువురి రైతుల ధాన్యం తేమను పరిశీలించారు.ధాన్యం తేమ 17 శాతం మించి ఉండకూడదన్నారు. రైతులు ధాన్యాన్ని పొలాల్లో ఆరబెట్టి 17 శాతం ఉన్న తర్వాతనే నేరుగా ఏడూళ్ళ బయ్యారం సబ్ స్టేషన్ ఎదురుగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానికి తీసుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో బయ్యారం ఏఈఓ కొమరం లక్ష్మణ్ రావ్, సునీల్, రైతులు సీతారాం రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: