CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రైతులు పండించిన పంటను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే కొనుగోలు చేయాలి: అశ్వారావుపేట తాహాసిల్దార్ కు వినతి పత్రం అందజేసిన కాంగ్రెస్ నాయకులు.

Share it:



 మన్యంటీవి, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండల తహసీల్దార్ కార్యాలయంలో టిపిసిసి ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక నల్ల చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని, అలాగే రైతులు పండించిన పంటను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ, కాంగ్రెస్ పార్టీ అశ్వరావుపేట మండల ప్రెసిడెంట్ మొగల్లపు చెన్నకేశవులు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ములకలపల్లి జడ్పీటీసీ సున్నం నాగమణి, ఎంపీటీసీలు వేముల భారతి, వగ్గెల అనుసూర్య, సత్యవరఫు తిరుమల మరియు అశ్వరావుపేట నియోజకవర్గ యువ నాయకురాలు వగ్గెల పూజ తదితరులు బుధవారం అశ్వారావుపేట మండల  తహసీల్దార్ చల్లా ప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతులు పండించిన పంటను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే కొనుగోలు చేయాలని, పంటకు మద్దతు ధర ప్రకటించాలని, వారు డిమాండ్ చేశారు. రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయన్నారు. తడిసిన ధాన్యాన్ని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయాలని, రైతులకు అండగా నిలవాలని, వారు డిమాండ్ చేశారు. లేనిచో కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు, నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జల్లిపల్లి దేవరాజు, మరియమ్మ, తగరం రాజేష్, తుమ్మ రాంబాబు, మహేష్, వేముల ప్రతాప్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Share it:

TS

Post A Comment: