మన్యం టీవీ మణుగూరు:
కార్తీక మాసం సందర్భంగా మణుగూరు నుండి అన్నవరం కు ప్రత్యేక బస్సులు నడపబడుతున్నాయి అని, మణుగూరు ఆర్టీసీ డిపో మేనేజర్ విజయ్ కుమార్ తెలిపారు.ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు బయలుదేరి సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు అన్నవరం చేరుకుంటుందని,మరల మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి మణుగూరు చేరుతుంది అని తెలిపారు. కార్తీక పౌర్ణమికి ప్రత్యేక బస్సులు గురువారం రాత్రి 8 గంటలకు ప్రత్యేక బస్సులు మణుగూరు నుండి అన్నవరం కు నడుపబడుచున్నవి అని, రిజర్వేషన్ సౌకర్యం కలదు అని కావున ప్రయాణికులు గమనించి,సేవలను వినియోగించుకోవాలని డిపో మేనేజర్ విజయ్ కుమార్ తెలిపారు.
Post A Comment: