మన్యం టీవీ మంగపేట.
రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించాలని సోమవారం మంగపేట తహశీల్దార్ కార్యాలయం ముందు బీజేపీ మండల అధ్యక్షులు ఎర్రంగాని వీరన్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తాటి కృష్ణ పాల్గొన్నారు ఈ సందర్బంగా తాటి కృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం అభినందనీయమని అన్నారు. ఈ సందర్బంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ కి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తరువాత దేశం లోని చాలా రాష్ట్రాలు వ్యాట్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయని, తెలంగాణ రాష్ట్రం లోని కెసిఆర్ ప్రభుత్వం మాత్రం తగ్గించక పోవటం రాష్ట్ర ప్రజల దురదృష్టమని అన్నారు.ఇప్పటికయినా రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేసారు. లేని పక్షంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చెపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో
జిల్లా ప్రధాన కార్యదర్శి గాజుల కృష్ణ, జిల్లా ఉపాధ్యక్షుడు అల్లే జనార్దన్, మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు మహమ్మద్ యాకుబ్ పాషా,దళిత మైనార్టీ మోర్చాల జిల్లా ప్రధాన కార్యదర్శి లు గద్దల రఘు, సయ్యద్ నాగూల్ మీరా,దళిత మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు జాడి రాంబాబు, కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు దంతేనపల్లి నరేందర్, మండల ప్రధాన కార్యదర్శి లోడే శ్రీను మండల సీనియర్ నాయకులు దూళిపాల విజయ్ కుమార్, తిరుమల రావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: