మన్యం మనుగడ, పినపాక :
పినపాక మండలం లోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపిడిఓ, ఎంపీవో అధ్యక్షతన జరిగిన ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ పై హరిత రాయబారులకు శిక్షణా కార్యక్రమం ఐటిసి బంగారు భవిష్యత్తు వాష్ ప్రోగ్రాం వారు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐ టి సిబంగారు భవిష్యత్తు ప్రోగ్రామ్ ఆఫీసర్ కృష్ణ మాట్లాడుతూ హరిత రాయబారులకు తడి పొడి ప్రమాదకర చెత్త పై అవగాహన కల్పిం చారు. అదేవిధంగా హరిత రాయబారులు తీసుకోవలసిన జాగ్రత్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో 23 పంచాయితీల హరిత రాయబారులు,ఐటిసి బంగారు భవిష్యత్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కృష్ణ, వాష్ ప్రోగ్రామ్ పి ఓ గణేష్ బాబు, ఎంపీడీవో శ్రీనివాస్, ఎం పి ఓ శ్రీనివాస రావు వాష్ ప్రోగ్రాం ట్రైనర్లు ముత్యాలరావు, సందీప్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: