.
మన్యం టీవీ ఏటూరు నాగారంజిల్లా
ములుగు జిల్లాలో పులి సంచరిస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ఫేక్ వీడియో లు పోస్ట్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా అటవీ అధికారి ప్రదీప్ కుమార్ శెట్టి హెచ్చరించారు.పులి సంబంధించిన వీడియోను ఎవరు కూడా సోషల్ మీడియాలో వైరల్ చేసి ప్రజలను భయాందోళనకు గురి చేయవద్దని విజ్ఞప్తి చేశారు.పులి సంబంధించిన ఫోటో,వీడియో లు సోషల్ మీడియాలో కనబడితే వారి వివరాలను స్థానిక అటవీశాఖ అధికారులకు తెలియాయజేయలని కోరారు.పులి సంచరిస్తున్న సమీప అటవీ ప్రాంతాల గ్రామస్తులను ఇప్పటికే అటవీ శాఖ అధికారులు అలర్ట్ చేయడం జరిగిందన్నారు.పులి కదలికలు గురించి తెలుసుకునేందుకు రాత్రి పగలు ప్రత్యేక బృందాలు పనిచేస్తుయని పేర్కొన్నారు.పులి సంచరిస్తున్న సమీప గ్రామ ప్రజలకు అటవీశాఖ అధికారులు సమాచారం తెలియజేస్తారని ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదని ఆయన చెప్పారు.
Post A Comment: