మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లోని ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో సహకార వారోత్సవాల సందర్భంగా సంఘం అధ్యక్షులు కుర్రి. నాగేశ్వర రావు అధ్యక్షతన సహకార సంఘం జెండా ను ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి హాజరైన మణుగూరు జడ్పీటీసీ పొశం.నరసింహా రావు మాట్లాడుతూ,సహకార సంఘాలు అందరు కలిసికట్టుగా పనిచేసి సంఘానికి మంచి పేరు తేవాలని,సంఘాన్ని ఇంకా పెద్ద సంఘంగా తయారుచేయాలని, రైతులు కూడా సంఘంలో వచ్చే రాయితీ విత్తనాలని సద్వినియోగం చేసుకోవాలని మాట్లాడారు.ఈ కార్యక్రమం లో పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,కో-ఆపరేటివ్ ఆఫీసర్ నరేష్,సంఘ డైరెక్టర్లు కురం సతీష్,ఉడతనేని రమేష్, సంఘ సి.ఇ.ఒ,టి.జ్ఞానదాస్ మరియు సంఘ స్టాఫ్ ఎండి. తాజుద్దీన్,జి.రాఘవులు పాల్గొన్నారు.
Post A Comment: