మన్యం టివి మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లో ఏఐసిసి మరియు పిసిసి ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక నల్ల చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని, అలాగే రైతులు పండించిన పంటను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ, కాంగ్రెస్ పార్టీ పినపాక నియోజకవర్గ కన్వీనర్ చందా. సంతోష్,కో కన్వీనర్ గురజాల. గోపి,టౌన్ అధ్యక్షులు పిరనాకి. నవీన్ బుధవారం మణుగూరు తహసీల్దార్ కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖర్ కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, రైతులు పండించిన పంటను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే కొనుగోలు చేయాలని, పంటకు మద్దతు ధర ప్రకటించాలని,వారు డిమాండ్ చేశారు.రైతులను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయన్నారు.తడిసిన ధాన్యాన్ని,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయాలని,రైతులకు అండగా నిలవాలని,వారు డిమాండ్ చేశారు.లేనిచో కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు, నిరసనలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ కో కన్వీనర్ మరియు మండల అధ్యక్షులు గురజాల గోపి,టౌన్ అధ్యక్షులు పిరీనాకి నవీన్,కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు పొలమురి.రాజు సాయిని వెంకటేశ్వరరావు,తాటి బోయిన నాగేశ్వరరావు,పంచాయతీరాజ్ శాఖ కన్వీనర్ విజయ్,ఎన్ ఎస్ యు ఐ లీడర్ ఆరిఫ్ భాషా, యువజన కాంగ్రెస్ నాయకులు, మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: