CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాలని సీపీఎం డిమాండ్

Share it:

 


మన్యం టీవీ :ఇల్లందు


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సీపీఎం పార్టీ మండల కమిటీ అధ్వర్యంలో ఇల్లందు డిప్యూటీ తహశీల్దార్ కిషోర్ గారికి రైతులు పండించిన వారి ధాన్యాన్ని ప్రతి గింజా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం సమర్పించారు.

అనంతరం రైతు సంఘం నాయకులు తాళ్లూరి కృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశం  సీపీఎం మండల కార్యదర్శి అబ్దుల్ నబి, సీనియర్ నేత దేవులపల్లి యాకయ్య మాట్లాడుతూ..దేశం మొత్తానికి అన్నం పెట్టే రైతన్నను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్పుల ఉబిలోకి నేదుతున్నాయని, కనీసం పండించిన పంటలు కూడా తీసుకోలేనీ పరిస్థితి దాపురించింది అని అన్నారు.ఇప్పటికైనా బేషరతుగా వరి ధాన్యం ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో దారావత్ రాందాస్,రమేష్,రాజు,సురేష్,మహేష్, రహీమ్, మున్నా,కౌసల్య తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: