మన్యం టీవీ మంగపేట.
చైల్డ్ లైన్ సే దోస్తీ బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్ 13 నుండి 20 వరకు వారం రోజుల పాటు పాఠశాల స్థాయి విద్యార్థులను మండలంలోని ఎంపిడిఓ కార్యాలయం,తహశీల్దార్ కార్యాలయం,మండల విద్యా వనరుల కేంద్రం,ఐసీడీఎస్,పోలీస్ స్టేషన్ బ్యాంక్ మరియు పోస్ట్ ఆఫీస్ కార్యాలయాలు సందర్శన చేయించి స్థానికంగా ఉన్న సమస్యలు వాటిని పరిష్కరించడానికి స్థానికంగా పనిచేస్తున్న ప్రభుత్వ కార్యాలయాలు అవి పని చేస్తున్న తీరు అక్కడ నిర్వహిస్తున్న కార్యక్రమాలు విద్యార్థులకు అర్థం వివరించి, కార్యక్రమాలు జరుగుతున్న తీరు విద్యార్థులకు ప్రత్యక్షo గా చూపించి తిరిగి పాఠశాల లలో విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేసి మిగిలిన విద్యార్థులకుకూడా విద్యార్థుల యొక్క అనుభవాలు వారు పొందిన జ్ఞానం, వారు విషయాల పట్ల ఏమి అవగాహనా చేసుకున్నారో వారితో తోటి విద్యార్థులకు తెలియజేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో రాజు పేట నుండి 5 గురు,కే జీ బి వి నుండి 5 గురు,మంగపేట నుండి 5 గురు మరియు ఆర్ సి ఎం నుండీ 5 విద్యార్థులను ఎంపిక చేయడం జరిగింది. ఈ కార్యక్రమం డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ అధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది మండల స్థాయి లో మండల విద్యాధికారి లకావత్ రాజేష్ కుమార్ పాల్గొన్నారు.
Post A Comment: