గుండాల /ఆళ్లపల్లి నవంబర్ 10 (మన్యం మనుగడ) వరి పంట సాగులో నాణ్యత ప్రమాణాలు అవసరమని ఏ డి ఏ తాత రావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. ఈ నెలాఖరుకల్లా కొనుగోలు కేంద్రాలు ప్రారంభమవుతాయని రైతులుధాన్యాన్ని కళ్ళలోనే ఆరబెట్టుకుని రావాలన్నారు. రైతులే బస్తాలు సమకూర్చుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంజుభార్గవి, వైస్ ఎంపీపీ ఎల్లయ్య, పిఎసిఎస్ చైర్మన్ రామయ్య , ఆత్మ కమిటీ సభ్యులు లక్ష్మయ్య , ఏవో అశోక్ కుమార్, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: