మన్యం టీవీ మంగపేట.
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మంగపేట మండలం చుంచుపల్లి ఆశ్రమ పాఠశాలలో సర్వే నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు తోకల రవి మాట్లాడుతూ విద్యార్థులు అడిగిన వారి సమస్యలను తెలుసుకున్నాడు. పాఠశాలలో ఉపాధ్యాయులు ఇంగ్లీష్ టీచర్ లేరు పాఠ్యపుస్తకాలు తెలుగు సోషల్ ఏడవ తరగతి నుంచి పదో తరగతి వరకు లేవు నీళ్లు లేక కొన్ని తరగతి గదుల్లో తలుపులు కిటికీలు లేక దోమతెరలు లైట్లు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విద్యార్థులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు లేనియెడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు మేరాజ్ ఖాన్, సాయిబాబు, వీర్రాజు, షఫీ, శివ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: