👉 మండల అధ్యక్షులుగా పెండ్యాల ప్రసాదరావు,
ప్రధాన కార్యదర్శిగా తొండ పు సుబ్బారావు ఎంపిక..
మన్యం టీవీ : జూలూరుపాడు, నవంబర్ 1, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల కేంద్రంలోని షిరిడి సాయి బాబా మందిరం లో జరిగిన మండల ఆర్యవైశ్య సర్వసభ్య సమావేశంలో నూతన మండల కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన మండల అధ్యక్షుడిగా పెండ్యాల ప్రసాదరావు, ప్రధాన కార్యదర్శిగా తొండ పు సుబ్బారావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మహంకాళి గోపాలకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా ప్రధాన కార్యదర్శి పెండ్యాల విజయ భాస్కర్ నూతన కార్యవర్గాన్ని ప్రకటించి నియామక పత్రాన్ని అందజేశారు. పట్టణ అధ్యక్షుడిగా ఉడతా పూర్ణచంద్రరావు, మండల కోశాధికారిగా కొదుమూరి భాను ప్రకాష్, ఉపాధ్యక్షులుగా కొదు మూరి శ్రీనివాసరావు ( పాపకొల్లు ) కొదుమూరు సతీష్ కుమార్, వందనపు రాఘవులు, జాయింట్ సెక్రటరీగా ఉడతా వేణుగోపాలరావు, కొదు మూరి సనత్ కుమార్, వేముల గురునాథం తో పాటు మరో ఐదుగురు కార్యవర్గ సభ్యులుగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు పెండ్యాల మాట్లాడుతూ.. ఆర్యవైశ్య సంఘ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, అందరూ సహకరించాలని కోరారు. తనను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు పేరుపేరునా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశంలో చీమకుర్తి కేశవరావు, ఉడతా పుల్లయ్య, వందనపు సత్యనారాయణ, పెండ్యాల రామనరసింహారావు, కంచర్ల రామారావు, కొదు మూరి మల్లికార్జున రావు, వందనపు కమలాకర్ రావు, కొదు మూరి కోటేశ్వరరావు, ఉడతా వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: