మన్యం టీవీ : ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు స్థానిక అర్ అండ్ ఆర్ కాలనీ కి చెందిన బిల్డింగ్ కార్మికుడు తుమ్మల సైదులు గుండె పోటు తో తెల్లవారుజామున ఆకస్మికంగా మృతి చెందారు. ఆయనకు భార్య కూతురు,కొడుకు చదువుకునే చిన్నపిల్లలు ఉన్నారు.ఆయన మృతికి సీఐటీయ,బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయ నాయకులు అబ్ధుల్ నబి,తాళ్లూరి కృష్ణ, కూకట్ల శంకర్,కామ నాగరాజులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..వెల్ఫేర్ బోర్డ్ నుండి కుటుంబానికి రావలసిన బెనిఫిట్స్ యూనియన్ దగ్గరుండి ఇప్పిస్తుందని,యూనియన్ అధ్వర్యంలో ఈ కుటుంబానికి అండగా నిలిచి సహరైస్తమని అన్నారు. సైదులు మృతికి సంతాపం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి నీ సీఐటీయ తెలిపింది. ఈ కార్యక్రమంలో సిలివేరివెంకన్న,కోటేశ్వరరావు,వీరస్వామి,రాజు,రమేష్,వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: