మాన్యం మనుగడ/ప్రతినిధి:ములకలపల్లి(నవంబర్18): మార్కెట్ యార్డులో మండల కాంగ్రేస్ పార్టీ సభ్యత నమోదు ఇంచార్జ్ తాండ్ర ప్రభాకరరావు అధ్యక్షతన,ముఖ్య అతిధిగా ములకలపల్లి జెడ్పీటీసి సున్నం నాగమణి అద్వర్యం లో మార్కెట్ యార్డు లో రైతులు నెలరోజులు నుంచి మార్కెట్ యార్డు లో ఆరబోసిన ధాన్యం కొనుగోలు చెయ్యకుండా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బందులు గురిచేస్తున్నాయని,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చెయ్యకుండా రోడ్డు మీద ధర్నాలు చెయ్యటం ఒక డ్రామా అని,రైతుల ధాన్యం కొనుగోలు చెయ్యవలసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు మీద కపట ప్రేమ చూపిస్తున్నాయని,వర్షాలు మూలంగా మార్కెట్ యార్డు లో రైతులు అరబోసిన ధాన్యం తడిసిపోయి రైతులు ఇబ్బందులకు గురి అవుతున్నారని,రైతుల దగ్గర నుంచి తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చెయ్యాలని కాంగ్రేస్ పార్టీ తరుపున డిమాండు చేస్తున్నానని,రైతుల వ్యతిరేక మూడు నల్ల చట్టాలు కూడా రద్దు చెయ్యాలని ఈ సందర్బంగా డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎం.డి.అంజమ్ మండల మైనారిటీ ప్రెసిడెంట్, పుష్పాల హనుమంతు,ఖాదర్ బాబా,కోండ్రు రవి,రైతులు,కాంగ్రేస్ నాయకులు తదితరులు పాలుగున్నారు.
Navigation
Post A Comment: