మన్యంటీవి, అశ్వారావుపేట: విద్యావలంటీర్ల పెండింగ్ వేతనాలు ఇప్పించాలని, విద్యావలంటీర్లను రెన్యువల్ చేసి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుకు అశ్వారావుపేట లో విద్యావాలంటీర్ల సంఘం వినతి పత్రం అందజేసారు. గత 2019 -2020 సంవత్సరం లాక్డౌన్ కు ముందు జనవరి, ఫిబ్రవరి, మార్చి మూడు నెలలు వేతనములు నిలిపివేయడం జరిగిందని, పలుమార్లు డిఈఓకి, కలెక్టర్ కి వినతి పత్రాలు అందజేసిన ఫలితం లేకపోయిందని, పాఠశాలలు తెరిచిన విధుల్లోకి తీసుకోకపోవడం మరియు పెండింగ్ జీతాలు ఇవ్వకపోవడం పరిస్థితి దుర్భరంగా తయారయ్యిందనీ, తమ సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే మెచ్చాకు వినతి పత్రం ద్వారా వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యావాలంటీర్ల సంఘం రాష్ట్ర నాయకురాలు పోలేటి భావన, షేక్ అభిదా కౌసర్, కే శ్రీదేవి, ఆర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: