మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని భూపతి రావు పేట గ్రామానికి చెందిన నల్లగొండ పుల్లయ్య అనే వ్యక్తి గోదావరి లో గల్లంతైన విషయము తెలిసినదే. రెండు రోజులుగా పుల్లయ్య ఆచూకీ కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి. సోమవారం రోజున గాలింపు చర్యల్లో భాగంగా పినపాక మండల తాసిల్దార్ విక్రమ్ కుమార్, ఏడూళ్ల బయ్యారం సిఐ రాజగోపాల్, ఎస్ ఐ టి వి ఆర్ సూరి పాల్గొన్నారు. సాయంత్రం వరకు గాలింపు చర్యలు కొనసాగినప్పటికీ పుల్లయ్య కు సంబంధించిన ఆచూకీ ఏమీ లభించలేదని తహసిల్దార్ విక్రమ్ కుమార్ తెలియజేయడం జరిగింది
Post A Comment: