మనుగడ/ప్రతినిధి:ధమ్మపేట(నవంబర్2):
అశ్వారావుపేట మరియు అప్పారావుపేట ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీలలో ఆయిల్ రికవరీ పెరిగినందున ఫ్యాక్టరీ మేనేజర్ లను మాజి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు వారిని అభినందిస్తూ శాలువా కప్పి సన్మానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పామాయిల్ సాగు చేసే రైతులకు కేసీఆర్ ప్రభుత్వం అండగా ఉంటుందని, పామాయిల్ రైతులను తప్పక అభినందించాలని,రాష్ట్రానికే మన అశ్వారావుపేట నియోజకవర్గం పామాయిల్ సాగు లో ఆదర్శంగా ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ రాష్ట్ర అధ్యక్షులు ఆలపాటి ప్రసాద్,ధమ్మపేట జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు,టీఆరెస్ పార్టీ మండల అధ్యక్షులు దొడ్డాకుల రాజేశ్వరరావు, కొయ్యాలఅచ్యుత్ రావు,అబ్ధుల్ జిన్నా,దొడ్డ సత్యం తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: