మన్యం టీవీ ఏటూరు నాగారం/నుగూరు వెంకటాపురం
ఏజెన్సీ దళితుల సాగు భూములకు రక్షణ కల్పించి దళితులకు న్యాయం చేయాలని సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో శుక్రవారం నుగూ రు వెంకటాపురం తాసిల్దార్ నాగరాజు కు వినతి పత్రం అందజేశారు.అనంతరం రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నగేష్ మాట్లాడుతూ.ఏజెన్సీలో ఆదివాసి గుడెలు వెలిసినప్పటి నుండి నేతకానిలు,మాదిగలు, మాలలు,ఆదివాసీలకు సేవలు గా ఉన్నారని అన్నారు.బ్రిటిష్ ప్రభుత్వం సైతం ఏజెన్సీ దళితులను కొండ గిరిజనులు గా పరిగణించి అప్పట్లో హక్కులు కల్పించారన్నారు. తరతరాలుగా ఏజెన్సీ దళితులు గిరిజనులతో మమేకమై నివసిస్తున్నారని, ఏజెన్సీ దళితుల గిరిజనేతరుల పరిగణించ వద్దన్నారు.అటవీ హక్కుల చట్టం కూడా తరాలుగా ఉంటున్న దళితులకు భూమిపై హక్కు కల్పించమని చెబుతుందని గుర్తుచేశారు.ఆదివాసీల తో పాటు దళితులకు కూడా పోడు భూములకు హక్కు పత్రాలు ఇచ్చి ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భారత నాస్తిక సమాజం ములుగు జిల్లా అధ్యక్షులు కొండ గొర్రల రాజేష్,సమతా సైనిక్ దళ్ ములుగు జిల్లా నాయకులు కుమ్మరి రాంబాబు,జనగాం కేశవరావు,బాధిత రైతులు దుర్గం రాములు,వెంకటరమణ దుర్గ మాధవి,దుర్గం వెంకయ్య, దుర్గం శ్రీనివాసరావు,దుర్గం సుశీల,బీసు,తిరుపతి,సత్యం, నీలమ్మ,సోమేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: