👉జిల్లా కలెక్టర్ ను పక్కదోవ పట్టిస్తున్న dm&ho, ఏవో ల పై చర్యలు తీసుకోవాలి
👉లేని యెడల ఏజెన్సీలో వైద్య సేవలను నిలుపుదల చేస్తాం
👉ఐటీడీఏ పీవో కు వినతి పత్రం అందజేసిన తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఆదివాసి(గిరిజన) ఎంప్లాయ్ సంఘం
మన్యం మనుగడ, భద్రాచలం:
ఏజెన్సీ ప్రాంతంలోని వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీలకు సంబంధించి జనరల్ నియామక ప్రక్రియ ప్రకటన పట్ల తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఆదివాసి(గిరిజన) ఎంప్లాయిస్ యూనియన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే ఈ ప్రకటను రద్దు చేసుకోవాలని ఆ సంఘం ఆధ్వర్యంలో భద్రాచలం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ మెడికల్ హెల్త్ ఆదివాసి ఎంప్లాయ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కారం వెంకటేశ్వర్లు దొర మాట్లాడుతూ జీవో నెంబర్ 68 కి విరుద్ధంగా ఏజెన్సీలో నియామకాలు చేపట్టడం దారుణమన్నారు. జిల్లా కలెక్టర్ ను పక్కదోవ పట్టిస్తున్న డి ఎం అండ్ హెచ్ వో, ఏవో ల పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేనియెడల దీపావళి అనంతరం ఏజెన్సీ ప్రాంతంలో వైద్య సేవలను నిరవధికంగా బంద్ చేస్తామని హెచ్చరించారు. అనంతరం భద్రాచలం ఐటీడీఏ పీవో కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం గౌరవ అధ్యక్షులు కారం వెంకటేశ్వర్లు దొర,నాయకులు పోల బోయిన కృష్ణయ్య ,వాసాల కృష్ణయ్య, ఉమాదేవి ,ఏటీఎ రాష్ట్ర అధ్యక్షులు కల్లూరి జయరాజు ,ఎఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్, పొలిటికల్ జేఏసీ వాసం రామకృష్ణ ,కన్నారావు ,బాదావత్ రాంప్రసాద్, రమేష్, రవి, ఆమని, పద్మ ,సుశీల, కుంజా సరస్వతి, శ్యామల, చిట్టెమ్మ ,జవ్వాజి సుధాకర్, తాటి బాబురావు, సున్నం కృష్ణ ,నరసింహారావు షారారాణి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: