CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

జాతర అభివృది పనులు షురూ .మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు రూ.75 కోట్లు.

Share it:

  •  

  • ఆసియాలోనే అత్యంత ఘనంగా జరిగే ఆదివాసి జాతర.

మన్యం టీవీ ఏటూరు నాగారం

ఆసియాలోనే అతి పెద్ద ఆదివాసీ జాతర,దక్షిణ కుంభమేళాగా ప్రసిద్దిగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర-2022 నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం 75 కోట్ల రూపాయలు విడుదల  చేయడంతో పనులు ప్రారంభించడం జరిగింది అని ములుగు జిల్లా కలెక్టర్  కృష్ణ ఆదిత్య అన్నారు. ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఐ టి డి ఏ కార్యాలయంలో మంగళవారం విలేకర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద గిరిజన, ఆదివాసీ జాతర గతంలో ఎన్నడూ లేనివిధంగా అత్యంత వైభవంగా జరుగుతోందన్నారు. కరోనా కష్టకాలం వల్ల బడ్జెట్ సమస్యలు ఉన్నప్పటికీ సమ్మక్క–సారలమ్మ జాతర-2022కు జీవో నెంబర్ 195 ద్వారా 75 కోట్ల రూపాయలను ఇవ్వడం అనేది గిరిజన,ఆదివాసీలు,వారి ఆచారాలు,పండగలు, జాతరని ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య  అన్నారు.

 తెలంగాణలో అన్ని వర్గాల పండగలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయన్నారు.అన్ని కులాలు,మతాల వారికి ఆత్మగౌరవ భవనాలు నిర్మించి, వారి పండగలు జరిపేందుకు నిధులు కేటాయించి,సెలవులు ప్రకటించి,అధికారికంగా నిర్వహిస్తూ అన్ని వర్గాలను గౌరవిస్తున్న ప్రభుత్వం ఇది అన్నారు.గత ఏడాది కూడా 75 కోట్ల రూపాయలను అంతకుముందు వంద కోట్ల రూపాయలను సమ్మక్క – సారలమ్మ జాతరకు కేటాయించి,అక్కడికి వచ్చే భక్తులకు అన్ని రకాల వసతులు కల్పించడం కోసం ఏర్పాట్లు చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు.ఇప్పటికే అనేక శాశ్వత నిర్మాణాలు, తాత్కాలిక నిర్మాణాలతో మేడారంలో భక్తుల కోసం ఏర్పాట్లు చేశామన్నారు.వచ్చే ఏడాది ఫిబ్రవరి 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరిగే జాతర కోసం వారం రోజుల కిందే 2.24 కోట్ల రూపాయలతో దుస్తులు మార్చుకునే గదులు, ఓ.హెచ్.ఆర్.ఎస్,కమ్యునిటీ డైనింగ్ హాల్ పనులకు శంకుస్థాపన చేశామన్నారు. మిగిలిన వసతులన్నీ కూడా డిసెంబర్ 31 లోపు పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు.ఈ జాతరను ప్లాస్టిక్ రహితంగా నిర్వహించేందుకు కూడా ముఖ్యమంత్రి కేసిఆర్ మార్గదర్శనంలో అన్ని ప్రత్యామ్నాయ వసతులు కల్పిస్తున్నామని,దేశ,విదేశాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పక్కా ప్రణాళికలతో అధికారులు పనులు చేస్తున్నారన్నారు. 

అత్యంత చారిత్రక ప్రాశస్త్యం ఉన్న అతిపెద్ద ఆదివాసీ జాతరకు ముఖ్యమంత్రి  75 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది అని తెలిపారు.ముందుగా కన్నాయి గూడెం మండలంలో ని తుపాకుల గూడెం సమ్మక్క బ్యారేజి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అంగన్వాడి కేంద్రంలను ఆకస్మాత్తుగా తనిఖీ నిర్వహించారు.మండలంలో కలెక్టర్  విస్తృతంగా పర్యటించడం తో ఆయా గ్రామాల ప్రజలు పలు సమస్యలను కలెక్టర్ కి విన్నవించారు.మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అడవి హక్కులకు దరఖాస్తు చేసుకునేవారు ఎఫ్ఆర్ సి కమిటీ పరిధిలోని గ్రామాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రాజెక్టు అధికారి వసంతరావు, ఏవో దామోదర్ స్వామి,తాసిల్దార్ కుసుమ రవీందర్,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: