- రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన వ్యక్తి ని సకాలం లో తన ఆటో లో హాస్పిటల్ కి చేర్పించిన వైనం
- గుడ్ల రంజిత్ కుమార్ కి పలువురి అభినందనలు
- సేవ చెయ్యడం లో విప్ రేగా కాంతారావు నాకు ఆదర్శం:గుడ్ల రంజిత్
మన్యం టీవి, కరకగూడెం:సేవ దృక్పథం లో గుడ్ల రంజిత్ మరో మారు భేష్ అనిపించుకున్నారు.క్షతగాత్రున్ని తన ఆటోలో సకాలంలో హాస్పిటల్ కి చేర్పించి మానవత్వం చాటుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
కరకగూడెం మండలంలోని మొగిళితోగు గ్రామానికి చెందిన కోడెం బొత్తయ్య భట్టుపల్లి గ్రామం వద్ద ప్రమాదానికి గురైనాడు.అదే సమయంలో ఈ.బయ్యారం నుండి కరకగూడెం వైపు వెళ్తుతున్న టీఆర్ఎస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ గుడ్ల రంజిత్ కుమార్ మానవ దృక్పథంతో స్పందించి తన ఆటోలో ప్రమాదానికి గురైన బొత్తయ్యను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు.ఈ సందర్భంగా మన్యం టీవి గుడ్ల రంజిత్ ని పలకరించగా సేవ కార్యక్రమాల్లో విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లడం జరుగుతుంది అని అన్నారు.
Post A Comment: