మన్యం టీవి, భద్రాద్రి కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి(సంగం నాగరాజు)
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్లో ఉన్న రూ. 3600 కోట్ల స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని, విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ కార్యాలయంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కార్యదర్శి కలెక్టరేట్లోకి దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. వారితో పాటు పలువురు నాయకులను అదుపులోకి తీసుకున్నారు.
Post A Comment: