మన్యంటీవి, అశ్వారావుపేట: అశ్వారావుపేట పట్టణానికి చెందిన ఇనుగంటి కావ్య ఐకార్ ఎంట్రన్స్ టెస్ట్ లో జాతీయ స్థాయిలో 33 వ ర్యాంకు సాధించింది. వ్యవసాయ కోర్సుల్లో యూజీ, పీజీ, పీహెచ్డీ ప్రవేశాల కోసం నిర్వహించే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చురల్ రిసెర్చ్ (ఐకార్) ఆలిండియా ఎంట్రెన్స్ ఎగ్జామ్ లో జాతీయ స్థాయిలో 33 వ ర్యాంక్ సాధించి అశ్వారావుపేటకు మంచి గుర్తింపు తీసుకు వచ్చిందని, అదే ఒరవడితో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అశ్వారావుపేటకు చెందిన పలువురు ప్రముఖులు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పట్టణంలోని జూపల్లి రెసిడెన్సీలో నివాసముంటున్న ఇనుగంటి వేణుగోపాల్ అనిత ల కుమార్తె అయిన ఇనుగంటి కావ్య ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ యూనివర్సిటీ రాజేంద్రనగర్ హైదరాబాద్ లో అగ్రికల్చర్ డిగ్రీ పూర్తిచేసి ఐకార్ ఎంట్రన్స్ లో 33 వ ర్యాంకు సాధించింది. ఇంతటి ఘనత సాధించిన ఇనుగంటి కావ్యను తల్లిదండ్రులు, స్నేహితులు, మేధావులు అభినందనల వర్షం కురిపించారు.
Navigation
Post A Comment: