CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మహారాష్ట్ర ఎన్ కౌంటర్ లో 26 మంది నక్సల్స్ మృతి.

Share it:

 


మహారాష్ట్ర ఎన్​కౌంటర్​లో​ 26 మంది నక్సల్స్ మృతిమావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పుల మోతతో గ్యారపట్టి అడవులు దద్దరిల్లాయి. జవాన్లు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 26 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు గడ్చిరోలీ ఎస్పీ అంకిత్‌ గోయల్‌ వెల్లడించారు.


ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర సరిహద్దులోని గడ్చిరోలి జిల్లా గ్యారపట్టి అటవీ ప్రాంతంలో ఉండే ఓ గ్రామాల్లోకి మావోయిస్టులు ప్రవేశించారనే సమాచారం పోలీసులకు అందింది. దీంతో శనివారం చుట్టుపక్కల గ్రామాల్లో కూంబింగ్‌ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు, మావోయిస్టులు పరస్పరం కాల్పులు జరిపారు.

ఈ సమాచారాన్ని అందుకున్న జిల్లా అధికారులు తక్షణమే ఆ ప్రాంతానికి హెలికాప్టర్​లను పంపడంతో పోలీసులు ఆ ప్రాంతాన్ని పోలీసులు పూర్తిగా జల్లెడ పట్టారు. అంతేగాకుండా సోదాలు ఇంకా కొనసాగుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.  అనంతరం ఆ ప్రాంతంలో 26 మంది మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు గుర్తించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు.

Share it:

TS

Post A Comment: