- తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి. వెంకట రావు కు వినతి పత్రం అందజేసిన,ఓసి 2 డంపర్ బొలెరో ప్రమాద మృతుడు వేల్పుల.చిన వెంకన్న భార్య సుజాత
- అన్ని విధాలుగా మా కుటుంబానికి న్యాయం చేయండి:గుర్తింపు సంఘంగా స్పందించండి
మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు సింగరేణి ఏరియా పీకే ఓసి-2 లో డంపర్ బొలెరో ప్రమాదంలో మృతి చెందిన వేల్పుల.చిన వెంకన్న కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకోవాలని సింగరేణి గుర్తింపు సంఘం గా స్పందించాలని కోరుతూ, వెంకన్న భార్య సుజాత మరియు కుమారుడు గణేష్ సోమవారం ఉదయం కొండాపురం సీఎస్పీ లో పిట్ మీటింగ్ కు హాజరైన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ బి. వెంకట రావు కు,ఏరియా నాయకులు వి.ప్రభాకర్ రావు సామ శ్రీనివాస రెడ్డి,ఎస్ కె అబ్దుల్ రవూఫ్,కోట. శ్రీనివాసరావు,కాపా.శివాజీ,వర్మ,సీహెచ్ సి రెడ్డిల సమక్షంలో కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ, ప్రమాదంలో తన భర్త చనిపోయి మూడు నెలలు కావస్తోందని,సింగరేణి యాజమాన్యం నుండి ఇప్పటివరకు తమ కుటుంబానికి ఎలాంటి నష్ట పరిహారం అందలేదని,గుర్తింపు సంఘంగా స్పందించి తమకు అందవలసిన వర్క్ మెన్ కాంపన్ సేషన్,ఎక్స్ గ్రేషియా, డంపర్ ఎక్కడంతో ధ్వంసమైన బొలెరో కి నష్ట పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పించాలని,ఆమె వెంకట రావు కు ఏరియా నాయకులను విజ్ఞప్తి చేశారు.ఈ ప్రమాద సంఘటన అనంతరం అన్ని కార్మిక సంఘాలు కూడా ఇదే విషయాన్ని లిఖిత పూర్వకంగా కూడా యాజమాన్యాన్ని డిమాండ్ చేశారని కూడా,ఆమె ఈ సందర్భంగా నాయకులకు గుర్తు చేశారు.త్వరగా తమ కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో టిబిజీకేఎస్ నాయకులు, ఏరియా కాంట్రాక్ట్ కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: