మన్యం టీవి, మణుగూరు:తెలంగాణ రాష్ట్ర
ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల వైఖరికి నిరసనగా మణుగూరులో 12 తారీఖున నిర్వహించనున్న ధర్నా ను విజయవంతం చేయాలని విప్,పినపాక శాశన సభ్యులు రేగా కాంతారావు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రైతులను దగా చేస్తోందని మండి పడ్డారు. రైతన్న పై బలవంతంగా నల్ల చట్టాలను రుద్దాలని చూడడం దారుణమన్నారు.కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పై కక్షపురితంగా వ్యవహరిస్తోందని మండి పడ్డారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై నిర్వహించనున్న ధర్నా కార్యక్రమాన్ని రైతన్నలు విజయవంతం చెయ్యాలని విప్ రేగా పిలుపునిచ్చారు.
Post A Comment: