మన్యం టీవీ కరకగూడెం: కేంద్ర ప్రభుత్వం రైతుల పై తీసుకున్న వ్యతిరేక నిర్ణయాలను వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పిలుపుమేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల సారంగ ఈ నెల 12 వ తారీఖున మణుగూరు తాసిల్దార్ కార్యాలయం ఎదుట ఉదయం 10 గంటలకు జరిగే ధర్నాను విజయవంతం చేయాలని కరకగూడెం మండలం టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రావుల సోమయ్య గౌడ్ రైతులకు, ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలనే ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Post A Comment: