భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 2 (మన్యం టీవీ) :-
శనివారం నాడు సిపిఐ జిల్లా నాయకుడు ఎస్కే సబీర్ పాష పుట్టినరోజు సందర్భంగా మొక్కల ప్రియుడు రాజశేఖర్ అల్ల నేరేడు మొక్క ను అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎస్ కె.సాబీర్ పాష మొక్కను నాటి తదుపరి మాట్లాడుతూ ఇలా చెట్లను నాటడం వలన పర్యావరణాన్ని మొక్కలు మానవాళికి స్వచ్ఛమైన ఆక్సిజన్ ను అందిస్తాయని మన ఆరోగ్యాన్ని కాపాడే పళ్ళ చెట్లను నాటడం ఎంతో మంచిదని అన్నారు, ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, మహిళా నాయకురాళ్ళు, కౌన్సిలర్ జమలయ్య, సర్పంచ్ శ్రీను, ఫహీమ్, ఖయ్యూమ్, కర్ష రత్నకుమారి, మంద నిర్మల, విజయలక్ష్మి, ఎలదండి నాగమణి, మద్దెల విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: