ITC పేపర్ కర్మాగారం ప్రమాదం లో కాంట్రాక్టర్ కార్మికుడు మృతి మృతిభద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక లోని ITC పేపర్ కర్మాగారంలో ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో SVL కాంట్రాక్టర్ సంబంధించిన ఓ కార్మికుడు మృతి చెందగా మరో ఇద్దరు కార్మికులకు తీవ్రంగా గాయాలయ్యాయి. మృతి చెందిన వ్యక్తి మోతె పట్టినగర్ పంచాయతీకి చెందిన కేసగాని వెంకటేశ్వర్లు గా గుర్తించారు. గాయపడిన ఇద్దరు కార్మికులు జగదీష్ నాగరాజు లను భద్రాచలంలోని ఆస్పత్రిలో చికిత్స కోసం తరలించారు. కాగా ఐటీసీ కర్మాగారంలో ఇటీవల తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వరుస ప్రమాదాలతో కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసి పోతుండడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సదరు కాంట్రాక్టర్ కానీ సంస్థ అధికారులు కానీ పనిప్రదేశాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..
Post A Comment: