మన్యం టీవి వెబ్ డెస్క్: లక్ష్మీదేవి పల్లి మండలం లోని జిల్లా ఫారెస్ట్ అధికారి క్యాంప్ ఆఫీస్ లో పోడు భూముల సమస్యలపై జిల్లా ఫారెస్ట్ అధికారి శ్రీ రంజిత్ నాయక్ మరియు ఇతర అధికారులతో సమావేశమై, పోడు భూముల సమస్యలపై చర్చించిన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు . ఈ చర్చలో భాగంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ పోడు భూములు ఉన్న ప్రతి పేదవాడికి భూమి దక్కేలా చూడాలని, పోడు భూముల్లో ఉన్న పేద వాళ్లను తొలగించకుండా చూడలి అని ముఖ్యమంత్రి కెసిఆర్ గారు స్పష్టం చేశారని, పొడు నిర్వహిస్తున్న ప్రతి పేదవాడికి న్యాయం జరిగేలా చూడాలని అన్నారు. ఈ యొక్క సమావేశంలో కొత్తగూడెం FDO అపయ్య, ఇల్లందు FDO నీరజ్ కుమార్, కిన్నెరసాని వైల్డ్ లైఫ్ FDO దామోదర్ రెడ్డి, భద్రాచలం FDO బాబు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: