CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

షెడ్యూలు ఇండ్స్త్రియల్ కార్మికులకు కనీస వేతనాలు జీవోలను వెంటనే విడుదల చేయాలి.CITU.

Share it:

 


 తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈనెల అక్టోబర్8న జరిగే రాష్ట్ర వ్యాప్త షెడ్యుల్ పరిశ్రమ కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలని జులుర్ పాడ్ మండలం లో షెడ్యూల్ పరిశ్రమలైన రైస్ మిల్లులు, బ్రిక్స్ ఇండస్ట్రీ,షాప్ గుమస్తాలు కార్మికుల జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశాల లో CITU భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ ప్రసంగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఏడు సంవత్సరాలు అవుతున్నా షెడ్యూలు పరిశ్రమలో పని చేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు జీవోలు విడుదల చేయడంలో తీవ్ర జాప్యం చేస్తోందని మరోవైపు యాజమాన్యం కార్మిక హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని 

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కనీస వేతన go లను జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఈనెల 8న జరిగే రాష్ట్ర వ్యాప్త సమ్మె లో షెడ్యూలు పరిశ్రమ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు.అనంతరం యాజమాన్యాలకు సమ్మె నోటీసు లు ఇవ్వటం జరిగింది.ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లనాయకులు బానోత్ ధర్మ,citu నాయకులు రామోహన్రావు,సంఘాల నాయకులు j. నరేష్,m. రమేశ్,L. సేవ,D. మధు, వినోద్ కుమార్ తది తరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: