హైదరాబాద్: రాష్ట్రంలో గంజాయి సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. పోలీసులు, ఆబ్కారీ అధికారులతో సీఎం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. డ్రగ్స్ రవాణా అరికట్టే వ్యూహంపై అధికారులతో చర్చించారు. ‘‘ రాష్ట్రంలో గంజాయి వినియోగం క్రమంగా పెరుగుతోందని నివేదికలు అందుతున్నాయి. గంజాయిపై తీవ్ర యుద్ధాన్ని ప్రకటించాలి. పరిస్థితి తీవ్రతరం కాకముందే అప్రమత్తం కావాలి. గంజాయి కట్టడికి డీజీ స్థాయి అధికారిని నియమించాలి. గంజాయి నియంత్రణకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలి. మాదక ద్రవ్యాల రహితంగా తెలంగాణను తీర్చిదిద్దాలి’’ అని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
Post A Comment: