గుండాల అక్టోబర్ 21 (మన్యం మనుగడ) నిరుద్యోగ మహిళలకు ఉపాధి కల్పన జి సి సి లక్ష్యమని డివిజనల్ మేనేజర్ కుంజ వాణి అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వన్ దన్ వికాస కేంద్రం ద్వారా ఏజెన్సీలోని గిరిజన మహిళలను గ్రూపు కు 20 మంది ఏర్పాటు చేసి వారికి అటవీ ఉత్పత్తుల పై శిక్షణ ఇస్తున్నామన్నారు. శిక్షణలో పాల్గొన్న మహిళలకు భోజనంతో పాటు రోజుకు 150 రూపాయల డబ్బులను కూడా అందజేస్తామన్నారు. ఇప్పటికి 200 మందికి శిక్షణను ఇస్తున్నామని త్వరలోనే 600 మహిళల శిక్షణ ఇచ్చే విధంగా రూపకల్పన చేస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ కోఆర్డినేటర్ రత్నం , జి సి సి అకౌంటెంట్ రాజన్న , సేల్స్ మెన్ లు శ్రీనివాస్ , పగడయ్యలు పాల్గొన్నారు
Navigation
Post A Comment: