మన్యం టీవీ : జూలూరుపాడు, అక్టోబర్ 22, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భారత దేశంలో వందకోట్ల కరోనా టీకా డోసులు పూర్తయిన సందర్భంగా జూలూరుపాడు ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ వీరబాబు కు బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ ఆధ్వర్యంలో ఘణ సన్మానం చేశారు. అనంతరం వైద్య సిబ్బందికి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశంలో ఉన్న ప్రజలందరికీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉచితంగా కరోనా టీకాలు అందజేశారని తెలిపారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కరోనా టీకాల పంపిణీ లో ప్రపంచంలోనే భారత దేశం రెండో స్థానంలో ఉండటం మన అందరికీ ఎంతో గర్వకారణం అన్నారు. మన ప్రధానమంత్రి కృషి వల్ల దేశంలో ప్రజలకు కరోనా టీకాలు అతి తక్కువ సమయంలో 100 కోట్ల డోసులు అందించడం జరిగిందని అన్నారు. ప్రభుత్వ వైద్యులు తమ ప్రాణాలు పణంగా పెట్టి వ్యాక్సినేషన్ విషయంలో అందరికీ చెప్పి ఎక్కడ ఉంటే అక్కడ ఇంటికెళ్ళి అవసరం అయితే పొలం దగ్గర కూడా వెళ్లి వారికి టీకాలు అందించినందుకు గాను వైద్య సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 100% పూర్తయ్యేదాకా ప్రజలందరూ సహకరించి కరోనా టీకాలు తీసుకోవాలని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు మాదినేని సతీష్, బిజెపి మండల అధ్యక్షుడు సిరిపురపు ప్రసాద్, బిజెపి మండల ప్రధాన కార్యదర్శి భూక్య రాజేష్ , బిజెపి ఓబీసీ మండల అధ్యక్షుడు వూర్లమోటి రవి, గోపాలరావు, వందనపు సుబ్బు , పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: