👉 సింగవరం మరియు చిన్న ఆర్లగూడెం గ్రామాల్లో వేరువేరుగా పెసా గ్రామసభలు..
👉 గ్రామ పరిధిలో ఉన్న ప్రభుత్వ మరియు గిరిజనేతరులు చట్టవిరుద్ధంగా అక్రమంగా ఆక్రమించిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని స్థానిక గిరిజనులకు ఇవ్వాలని..
మన్యం టివి దుమ్ముగూడెం:
చిన్న ఆర్లగూడెం గ్రామంలో గత 25 సంవత్సరాలుగా పోడు వ్యవసాయం చేస్తున్న సాగుదారులను గుర్తించి వారికి అటవీ హక్కుల గుర్తింపు చట్టం2006 ప్రకారం హక్కు పత్రాలు మంజూరు చేయాలని, పోడు భూములకు త్రీ పేజ్ కరెంటు ఏర్పాటు, రవాణా వ్యవస్థ, నీటి సదుపాయం మరియు నీటి కుంటాలను తవ్వకాలు చేయాలి.
అదేవిధంగా పెసా గ్రామసభ అనుమతి లేకుండా ఫారెస్ట్ అధికారులు పోడు భూముల జోలికి వెళ్లారాదు అనీ, గతంలో రైతులు వేసిన పంటను నాశనం చేసిన ఫారెస్ట్ అధికారుల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తీర్మానం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో శ్రీ చండికా ట్రస్ట్ ప్రతినిది ఊకె రవి, ఆదివాసీ సేన మండల కన్వీనర్ కొర్సా నరేష్, పంచాయితీ కార్యదర్శి కార్తిక్ మరియు నరేష్,అటవీ శాఖ అధికారి రామూర్తి, ఎం పి టి సి నూప నాగలక్మి,సర్పంచ్ లు సోడి కొండయ్య,పాయం సునీత,కొర్సా నరసింహరావు,పెసా మోబిలైజర్ పెనుబల్లి శ్రీరాములు, పెసా కమిటీ సభ్యులు కల్లూరి రవి,నూప సీతయ్య,పెనుబల్లి తిరుపతి రావు, మర్మం రమేష్, గ్రామ పెద్దలు భద్రయ్య, సుబ్బయ్య, గంగరాజు, రాజు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: