ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి అడవుల్లో భారీగా మావోయిస్టు మందుగుండు సామగ్రి లభ్యం
*16 మీటర్ల పొడవు ఒక మీటరు వెడల్పు కలిగిన ఎర్రటి ఎర్రజెండాలు వాడే గుడ్డ.
*ఐదు మీటర్ల పొడవు ఐదు మీటర్ల వెడల్పు కలిగిన నల్లటి ప్లాస్టిక్ కవర్.
*25 డిటోనేటర్
25 జెంటిల్మెన్ స్టిక్స్
100 వైట్ పేపరస్
5 మెడికల్ గేట్స్.
మన్యం టీవీ ఏటూరు నాగారం
ములుగు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ మాట్లాడుతూ సిపిఐ మావోయిస్టు పార్టీ నాయకులు పుల్లూరు ప్రసాద్ రావు అలియాస్ చంద్రన్న,
బడే చొక్కారావు @ దామోదర్,
కొయ్యడ సాంబయ్య @ అజా ద్,వారి ఉనికిని చాటుకోవడం కోసం ములుగు జిల్లా లో ప్రశాంతంగా ఉన్నత అడవుల విధ్వంసం సృష్టించాలని ఉద్దేశంతో ప్రజలను భయ బ్రాంతులకు గురి చేయాలని సిపిఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ తన ఉనికిని చాటుకోవడం కోసం మళ్లీ గ్రామాల్లో ప్రభుత్వ వ్యతిరేక పనులకు హింసకు విధ్వంసాలకు పాల్పడే సాయుధ విప్లవ ప్రజాస్వామిక ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు మరియు ప్రభుత్వ అధికారులను అమాయక ప్రజలను అంతమొందించే అందుకే ఈ యొక్క సంఘటనకు ఒడిగట్టారని జిల్లా ఎస్పీ తెలిపారు.ముఖ్యంగా పోలీస్ సిబ్బందిని ప్రజా ప్రతినిధులను మట్టుపెట్టే ప్రజా ప్రభుత్వం ఆస్తులను ధ్వంసం చేయాలని దురుద్దేశంతో తాడ్వాయి మండలం కల్వపల్లి పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేసినట్లు,తెలుస్తోంది.ముఖ్యంగా మేడారం జాతరకు ఎక్కువ జనాలు ప్రజా ప్రతినిధులు పోలీసు వారు నిరంతరం వస్తూ ఉంటారని వారి మీద పేలుడు పదార్థాలు పేల్చి అలజడి సృష్టించాలనే పన్నాగం పన్నారనీ.ముఖ్యంగా తాడ్వాయి మండలం లోని ప్రజలు మావోయిస్టు పార్టీ యొక్క కార్యకలాపాలకు సహకరించకుండా శాంతి యుత మార్గంలో వ్యవస్థ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంటే మావోయిస్టు పార్టీ అలజడి సృష్టించాలని ప్రయత్నిస్తున్నారనీ ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఎస్పి సాయి చైతన్య,ఓఎస్డి శోభన్ కుమార్, సీఆర్పీఎఫ్ కమాండెంట్,పస్రా సీఐ, తాడ్వాయి ఎస్సై వెంకటేశ్వరరావు, పస్రా ఎస్సైములుగు సీఐ ములుగు ఎస్సై బాంబు స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: