మన్యం మనుగడ వాజేడు. ,వాజేడు:-గత వారంరోజులుగా అనారోగ్యంతో పోరాడి మంగళవారం మరణించిన మండల కేంద్రంలోని పెనుగోలు కాలనీకి చెందిన చిన్నారి ఉయిక వైశాలి కుటుంబాన్ని బుధవారం ములుగు జిల్లా డీ ఎం ఎచ్ వో అప్పయ్య పరామర్శించారు.ఈ సందర్బంగా ఆయన వైశాలి ఎలా మృతి చెందిందో,అనారోగ్యానికి గల కారణాలను తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు.ఇక ముందు ఏ అనారోగ్య సమస్యల ఉన్న ప్రతి ఒక్కరు ముందుగానే ప్రభుత్వ హాస్పిటల్ కి వెళ్లి వైద్యులను సంప్రదించలని,వైద్యులు అందుబాటులో లేకుంటే వెంటనే నాకు సమాచారం ఇవ్వమని తల్లిదండ్రులకు బంధువులకు తెలిపారు.అనంతరం తల్లిదండ్రులను ఓదారుస్తూ వారికీ కొంత నగదు సహాయాన్ని అందించారు.ఆయన వెంట ఏటూరునాగారం ఐ టీ డీ ఏ డిప్యూటీ డీ ఎం ఎచ్ వో మంకిడి.వెంకటేశ్వరరావు,వాజేడు వైద్యుసిబ్బంది సబ్ యూనిట్ ఆఫీసర్ శరత్ బాబు,హెల్త్ సూపర్ వైజర్ కోటిరెడ్డి,ఏ ఎన్ ఎం రాజేశ్వరి,అంగన్వాడీ టీచర్ నాగలక్ష్మి,ఆశా సమ్మక్క తదితరులు ఉన్నారు.
Post A Comment: