మన్యం టివి దుమ్ముగూడెం:
చత్తీస్ఘడ్ రాష్టం, సుకుమా జిల్లా..కుకనారూ,గాది రాష్ పుల్భగిడి ,చింత గుఫా గ్రామాలకు చెందిన 43 మంది మావోయిస్టులు' లోన్ వరట్ ' అనే ఈ కార్యక్రమానికి పోలీసుల ముందు లొంగిపోయిన మావోయిస్టులు. సుకుమా జిల్లా ఎస్పీ సునీల్ శర్మ ..మరియు సిఆర్పిఎఫ్.. అధికారుల ఎదుట లొంగిపోయారు వీరంతా పలు విధ్వంసకర సంఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు.వీరే కాకుండా ఇంకా అడవులలో ఉన్నటువంటి మావోయిస్టులందరు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని లొంగి పోయిన మావోయిస్టులకు ప్రభుత్వాలు అండగా ఉంటాయి అని, అపోహలు వీడి వారి కుటుంబాలతో ప్రశాంతంగా జీవించాలని అడవులలో ఉండి సాధించేది ఏమి లేదని ఎస్ పి సునీల్ శర్మ అన్నారు.అంతే కాకుండా లొంగిపోయిన 43 మంది మావోయిస్టులతో ఒకరి పై లక్ష రూపాయల రివార్డు కూడా ఉన్నట్లు ఆయన తెలిపారు.లొంగిపోయిన మావోయిస్టులతో కలిసి ఆయన భోజనం కూడా చేశారు.
Post A Comment: