CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోడు సాగుదారులకు పట్టాలు అందిస్తాం.

Share it:

 

మన్యం టీవీ ఏటూరు నాగారం

పోడు చేసుకుంటున్న అర్హులందరికీ న్యాయం చేస్తూ పట్టాలు ఇచ్చి, ఆ భూములను వ్యవసాయ యోగ్యంగా మార్చుతూ.. అడవిని సంరక్షించి భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణం అందించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అన్నారు.పోడు భూముల సమస్య పరిష్కారం,అడవుల సంరక్షణపై ములుగు జిల్లా కలెక్టర్ ఆడిటోరియంలో మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ నేతృత్వంలో శనివారం అఖిల పక్ష సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ..పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసిఆర్ ఇటీవలే ఒక కమిటీ వేసి, దాని ప్రతిపాదనలు ఆమోదించుకుని ముందుకు వెళ్ళాలి అని ఆలోచన చేశారు. నవంబర్ 8వ తేదీ నుంచి పోడు భూములపై క్లైమ్స్ తీసుకుంటాం.ఎక్కువ అటవీ ప్రాంతం కలిగిన జిల్లా ములుగు.2006 లో అటవీ హక్కుల చట్టం అమల్లోకి వచ్చింది.చట్టం వచ్చాక 6,90,059 ఎకరాలకు 2, 04,176 క్లెయిమ్స్ వస్తే..3,08,614 ఎకరాలకు సంబంధించి 96, 676 క్లెయిమ్స్ కు హక్కు పత్రాలు ఇచ్చారు.3,27,880 ఎకరాలకు సంబంధించి 91,942 క్లెయిమ్స్ అనర్హత కలిగినవిగా తిరస్కరిస్తే...53,565 ఎకరాలకు సంబంధించిన 15,558 క్లెయిమ్స్ పెండింగ్ లో ఉన్నాయి.తెలంగాణ ప్రభుత్వం వచ్చాక 68 లక్షల ఎకరాల అడవి భూమి ఉన్నట్టు అధికారులు గుర్తించారు.2006 కు ముందే 6 లక్షల ఎకరాలకు పైగా అటవీ భూమి సాగులో ఉంది.కొత్తగా పోడు ఆపాలని సీఎం కేసిఆర్ గారు కొత్త క్లెయిమ్స్ తీసుకోవడం ఆపారు.అప్పటికే పోడు చేసుకుంటున్న వారికి అన్యాయం జరుగొద్దు అనేది ప్రభుత్వ ఆలోచన.ఇకపై ఇంకో ఇంచు అడుగు కూడా పోడు కాకుండా చూడాలని అడవిని రక్షించాలని సీఎం కేసిఆర్ ఆలోచించారు.రాజకీయ పార్టీలు ఓట్ల కోసమే పని చేస్తాయి. కానీ దేశంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి హారితహరం ద్వారా ఇన్ని చెట్లు పెట్టలేదు.ఇపుడు మన సరిహద్దు రాష్ట్రాలు చతిస్గడ్, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి తెలంగాణలోకి రాగానే మన దగ్గర చెట్లను చూడగానే తెలంగాణ అని తెలుస్తుంది. చాలా ఏజెన్సీ గ్రామాల్లో సింగిల్ ఫేస్ కరెంట్ లేకపోతే సీఎం కేసిఆర్ 230 కోట్ల రూపాయలు ఇచ్చారు.ఆర్.ఓ.ఎఫ్.ఆర్ అర్హులందరికీ పట్టాలు ఇస్తాం.ఈ జిల్లాలో ఫారెస్ట్ ఇబ్బందులను అధిగమించి అనుమతులు ఇవ్వడానికి అనుసంధాన అధికారిని నియమిస్తామనీ అన్నారు. పేదలకు మేలు చేసే విధంగానే ఈ ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయి.గుత్తి కోయలు 80 గ్రామాలుగా మన రాష్ట్రంలో ఏర్పడ్డారు.ఎవరు ఎక్కడైనా బతుకొచ్చు..కానీ అక్కడి స్థానిక హక్కులు బతుకుదెరువు కోసం వచ్చిన వారికి లభించవు.గ్రామ, మండల,డివిజన్,జిల్లా,రాష్ట్ర స్థాయి కమిటీల నియామకం తరవాత మళ్లీ సమావేశం ఏర్పాటుచేసుకుందాం.అర్హులందరికీ న్యాయం చేద్దాం అన్నారు.ఎంపి మాలోత్ కవిత మాట్లాడుతూ...అఖిల పక్షం నేతలు చెప్పేది వందకు వంద శాతం నిజం.గతంలో పాస్ బుక్ లు ఇచ్చిన వారికి హక్కు వచ్చిందనీ,రైతు బందు వస్తుంది...కొంతమందికి మాత్రం పని చేయడం లేదు. రాజ్యాంగంలో పొందు పర్చిన వాటిని పక్కకి పెట్టకుండా ప్రభుత్వం ఆలోచిస్తుంది. సాగు చేసుకునే వారికి పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేద్దాం.అని అన్నారు.కలెక్టర్ కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ....ప్రతి ఆవాసానికి frc(ఫారెస్ట్ రైట్స్ కమిటీ) ఏర్పాటు చేస్తాం.గ్రామ సభ ఆధ్వర్యంలో ఈ కమిటీ పని చేస్తుంది.2005 నుంచి నేటి వరకు శాటిలైట్ మాప్స్ మా దగ్గర ఉన్నాయి.చట్టబద్ధ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ హక్కు పత్రం వస్తుందనీ అన్నారు.సమావేశంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ,ఎమ్మెల్యే సీతక్క,జడ్పీ వైస్ చైర్మన్ నాగ జ్యోతి,అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠీ, ఎస్పి సంగ్రామ్ సింగ్,అఖిల పక్ష నేతలు,అధికారులు పాల్గొన్నారు
Share it:

TELANGANA

Post A Comment: