CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనవి.

Share it:

 



 ఎస్ఐ ప్రవీణ్ కుమార్.

మన్యం టీవీ కరకగూడెం: విది నిర్వహణలో భాగంగా అమరులైన పోలీసులకు  పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కరకగూడెం పోలీస్ స్టేషను ఆవరణలోని అమరులైన పోలీసు సిబ్బందికి శ్రద్ధాంజలి ఘటించి వారి కుటుంబలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ1997 సం,,లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి పినపాక మండలంలోని కరకగూడెం పోలిసు స్టేషన్ పై సుమారు 50 మంది మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 8 మంది ఏఏస్పీ,8 మంది సివిల్ కానిస్టేబుల్స్ మొత్తం 16 మంది పోలీసు సిబ్బంది అమరులు  కావడం చాలా దురదృష్టకరం అన్నారు.ఈ ఘటనలో మృతి చెందిన పోలీసుల కుటుంబాలను ఓదార్చాడానికి అప్పటి ముఖ్యమంత్రి నారా.చంద్రబాబు నాయుడు హెలికాఫ్టర్ మార్గంలో వచ్చి వారి కుటుంబాలను పరామర్శించడం జరిగిందని గుర్తు చేశారు. అనంతరం 1992  సెప్టెంబరు 4 న ఏఏస్పీకి చెందిన 10 మంది పోలీసులు ఏడుళ్ళ బయ్యారం పోలీసు స్టేషన్ నుండి విది నర్వహణలో భాగంగా కరకగూడెం పోలీసు స్టేషన్ కి వస్తున్న క్రమంలో  రాళ్ళవాగు వద్ద మావోయిస్టులు అమర్చిన మందు పాత్రలో 10 మంది పోలీసులు మరణించడం చాలా బాధకరం అన్నారు.సమాజంలో అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం అన్నారు.ప్రజల మధ్యలో ఉంటు సమాజ శ్రేయస్సే ధ్యేయంగా విధులు నిర్వహిస్తున్నది పోలీసులు మాత్రమే అన్నారు.ఈ కార్యక్రమంలో ట్రైని ఎస్ఐ పి.గణేష్, అర్ ఎస్ఐ ఎ రమేష్ స్పెషల్ పోలీసు, సివిల్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: