మన్యం టీవీ చర్ల:
చర్ల మండలం కేంద్రంగా చేసుకొని జోరుగా సాగుతున్న గోవుల అక్రమ రవాణాను అరికట్టాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ జిల్లా సభ్యులు చర్ల తహశీల్దార్ మరియు పొలీస్ శాఖ వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ గోవుల అక్రమ రవాణా చత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి చర్ల కేంద్రంగా చేసుకుని కొందరు బడాబాబులు వరంగల్ హైదరాబాద్ తదితర ప్రాంతాలకు రాత్రులు తరలిస్తున్నారు. దీని మూలంగా గోవులును హింసించడంమే కాకుండా గోవులను లోడ్ చేసుకుని అతివేగంగా వెళ్తున్న వాహనాలు ప్రమాదాలు గురిచేస్తున్నాయి. కావున ఇటువంటి అక్రమ రవాణాను చర్ల ప్రాంతంనుంచి అరికట్టాలని రెవిన్యూ మరియు పోలీస్ శాఖ వారికి వినతి పత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల విశ్వహిందూ పరిషత్ భజరంగ్ దళ్ సభ్యులు పాల్గొన్నారు.
Post A Comment: