CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి

Share it:

 


సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు దుర్గం నగేష్

మన్యం టీవీ ఏటూరు నాగారం

ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్న దళితుల పోడు భూములకు రాష్ట్ర ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నగేష్ బుధవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ హక్కుల చట్టం ప్రకారం మూడు తరాలుగా ఏజెన్సీలో నివశిస్తూ సాగు చేసుకుంటున్న పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలన్నారు.దళితులు తమ తాతల తండ్రుల కాలం నుండి ఎన్నో ఏళ్లుగా ఎస్టీలతో మమేకమై ఏజెన్సీలో నివశిస్తున్నారని,ఎస్టీలతో పాటు ఎస్సీలకు కూడా సమాన హక్కులు కల్పించాలన్నారు. ఎస్టీలతో మమేకమై జీవిస్తూ పోడు భూములను సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారని.అలాంటి భూములకు పట్టాలు ఇవ్వకుండా పార్ట్‌-బీలో పెట్టి ఆన్‌లైన్‌లో ఎక్కించకుండా దళిత రైతులను ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ ఫారెస్ట్‌ అధికారులచే పట్టా భూములను లాక్కొనే ప్రయత్నం చేస్తోందని మండిప డ్డారు.అంతేకాకుండా పోడు భూములకు జాయింట్‌ సర్వే నిర్వహించకుండా ఫారెస్ట్‌ అధికారులచే దళిత,గిరిజనుల మీద కేసులు బనాయిస్తున్నారన్నారు.వారి భూములను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే పోడు భూములకు సర్వే నిర్వహించి పట్టా పాసు పుస్తకాలు ఇవ్వాలని కోరారు.

Share it:

Post A Comment: