CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బైంసాలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి

Share it:



మన్యం టీవీ ఏటూరు నాగారం అక్టోబర్ 25

భైంసా పట్టణంలో పట్టపగలు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని  సమతా సైనిక్ దళ్ నేతకాని సంఘం ఆధ్వర్యంలో ములుగు  జిల్లా కేంద్రంలోని అంబెడ్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శించారు.ఈ సందర్భంగా అంబేద్కర్  విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. అనంతరం ములుగు జిల్లా కమిటీ సభ్యులు చెన్నూరి నర్సయ్య మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే శిక్షించాలని వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంబేద్కర్ విగ్రహాలకు రక్షణ కల్పించాలని విగ్రహాల దగ్గర సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కమిటీ సభ్యులు జనగం చిన వీరస్వామి,చెన్నూరి నర్సయ్య,గాంధేర్ల సారయ్య, బండి వీరస్వామి,రామటేంకి చంద్రయ్య, జనగం వెంకన్న, గాంధేర్ల పాపయ్య,గోగు ముత్తయ్య,జనగం సమ్మయ్య, దుర్గం సమ్మయ్య,జనగం లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: