గుండాల అక్టోబర్ 3 (మన్యం మనుగడ) ఐ టి సి ఎన్నికల్లో విజయం సాధించిన ఐ ఎన్ టి యు సి నాయకుడు కనకమేడల హరి ప్రసాద్ ను గుండాల మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు సన్మానించారు. ఆదివారం భద్రాచలం క్రాస్ రోడ్ లో గల పార్టీ కార్యాలయంలో ఆయనను సన్మానించారు. హరి ప్రసాద్ ఏడు సార్లు ఐ టి సి ఎన్నికల్లో గెలిచారు అన్నారు. ఓటమి లేకుండా గెలవడం అభినందనీయమని తెలుగుదేశం నాయకులు కొనియాడారు. ఈసారి కూడా గెలిచి ఐ ఎన్ టి యు సి సత్తాను నిరూపించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు తొలేం సాంబయ్య , కార్యదర్శి ఇల్లందుల అప్పారావు, ఇల్లందుల నరసింహులు, మర్కోడు టిడిపి నాయకులు తాటికొండ శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: