మన్యం టీవీ : జూలూరుపాడు, అక్టోబర్ 28, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల కేంద్రంలో టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు చౌడం నరసింహారావు, పిఎసిఎస్ చైర్మన్ లేళ్ళ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పొంగులేటి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. మా ప్రియతమ నాయకుడు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం లో ఎంపీపీ లావుడ్యా సోనీ, వెంగన్నపాలెం ఎంపీటీసీ దుద్దుకూరు మధుసూదన్ రావు, జిల్లా రైతు బంధు సమితి సభ్యులు వేల్పుల నరసింహారావు, మండల రైతు బంధు సమితి కన్వీనర్ యదళ్ళపల్లి వీరభద్రం, మండల ఎస్సీసెల్ అధ్యక్షులు పాణితి వెంకటేశ్వర్లు, టిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు పోతురాజు నాగరాజు, సీనియర్ నాయకులు శ్రీనాధ నాగరాజు, రామిశెట్టి నాగేశ్వరరావు, మోదుగు రామకృష్ణ, ధరావత్ రాంబాబు నాయక్, పాలెపు భద్రయ్య, రామిశెట్టి రాంబాబు, మాచిని సత్యనారాయణ, మాడుగుల నాగరాజు, టిఆర్ఎస్ పార్టీ మండల యువజన అధ్యక్షులు గుగులోత్ చంటి నాయక్, బోడ బాబూలాల్, నరేష్, పాపకొల్లు ఉపసర్పంచ్ కంబాలపల్లి మహేష్, మరియు కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Navigation
Post A Comment: