మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, కునవరం గ్రామ పంచాయతీ లో నిర్వహిష్తున్న కరోన వ్యాక్సిన్ సెంటర్ ను శుక్రవారం కూనవరం ఎంపీటీసీ జిల్లా ఎంపీటీసీల ప్రధాన కార్యదర్శి గుడిపూడి.కోటేశ్వరరావు,స్థానిక సర్పంచ్,సర్పంచ్ ల సంఘం మండల అధ్యక్షులు ఏనిక.ప్రసాద్ పరిశీలించారు. వాక్సినేషన్ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 100 మంది కి వ్యాక్సిన్ పూర్తి చేయగా,ఇంకా మిగిలిన 40 మందికి కూడా బాంబే కాలనీ సెంటర్ నుండి తెప్పించి వేయడం జరిగింది అని తెలిపారు.ఇదే చైతన్యం ను కొనసాగించి 18 సంవత్సరం లు నిండిన ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ వేపించుకుని,కరోన మహమ్మారి ని తరిమి కొట్టాలని ప్రజల కు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏ. యన్.ఎం లను,ఆశా వర్కర్ల ను ప్రత్యేకం గా అభినందించారు.
Post A Comment: