మన్యం టీవి:ములకల పల్లి : రజక వృత్తిదారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిటికెన ముసలయ్య 74వ పుట్టినరోజు సందర్భంగా రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు ముదిగొండ రాంబాబు మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది.ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ నిగర్వి మృదుల స్నేహ స్వభావం కలిగిన వారిని రజక వృత్తిదారుల పట్ల అమితమైన ప్రేమ కలిగిన గొప్ప వ్యక్తిత్వం కలిగిన ముసలయ్య మరిన్ని జన్మదినాలు చేసుకోవాలని ఆశిస్తూ,వీరు కరోనా సమయంలో రజక వృత్తిదారులు జీవనోపాధి లేక అనేక ఇబ్బందులు పడుతుంటే వృత్తిదారుల జీవనోపాధి కోసం ఇస్త్రీ చేయించుకుంటే ఆ వేడికి కరోనా చనిపోతుంది.రాదు అనే ప్లెక్సీలు ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాద్రి జిల్లా కు ఫ్లెక్సీలు ముద్రించి వృత్తి దారుల జీవనోపాధిని ఆదుకున్నారు. అంతేకాకుండా జిల్లా మొత్తం విస్తృత సంబంధాలు ఏర్పరుచుకుని రజకులకు అందవలసిన ఉచిత విద్యుత్ మీటర్లను ఉద్యమం లాగా తీసుకొని ఆన్లైన్ చేయించటం జరిగింది.మన జాతి లో బలహీన కుటుంబాలను ఎంచుకొని వారికి ఆన్లైన్ సమయంలో మొబైల్ ఫోన్లు మరియు బీద విద్యార్థులకు విద్య దానం చేస్తున్న ఈ ముసలయ్య మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని మన సంఘానికి దిక్సూచి లాగా ఉంటూ రాబోవు రజక వృత్తిదారుల అభ్యుదయానికి తోడు పడతారని ఆశిస్తూ ముసలయ్య కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు.
Post A Comment: